Breaking News

పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ ఆధారిత గ్రనేడ్‌తో దాడి


దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులకు పాకిస్థాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నారు. పంజాబ్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాద శక్తులు మరోసారి క్రియాశీలకంగా మారినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల కిందట హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు ఎగురువేసిన విషయం తెలిసిందే. తాజాగా, పంజాబ్‌లో పోలీస్ ప్రధాన కార్యాయాన్నే టార్గెట్ చేస్తూ ముష్కరులు దాడికి పాల్పడటం గమనార్హం. గతవారం నలుగురు ఖలిస్థాన్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

By May 10, 2022 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rpg-fired-at-punjab-police-intelligence-headquarters-in-mohali-but-it-fails-to-explode/articleshow/91456713.cms

No comments