Breaking News

మరింత ముదిరిన శ్రీలంక సంక్షోభం.. ఎమర్జెన్సీ ప్రకటన.. సైన్యానికి విశేష అధికారాలు


శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరడంతో తీవ్ర అశాంతి, జనాగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబయా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ, అత్యవసర సేవలు సరఫరా నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అధ్యక్షుడి నిర్ణయంతో సైన్యానికి విశేష అధికారాలు లభించాయి.

By April 02, 2022 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/unrest-over-economic-crisis-sri-lanka-president-declares-state-of-emergency/articleshow/90603414.cms

No comments