Breaking News

58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే ..!


కొంతమంది పెద్దవాళ్లను చదువుకోమంటే ఈ వయస్సులో చదువా..? అని కొట్టిపారేస్తారు. కానీ 58 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. రాజకీయాల్లో రాణించి ఎప్పుడో వదిలేసిన చదువును మళ్లీ కొనసాగించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే అయిన అంగాడ కన్హార్ పిల్లలతో కలసి పరీక్ష రాశారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పైగా పాస్ అవుతానో.. లేదో తెలియదని కానీ పరీక్ష అయితే రాశానని చెప్పుకొచ్చారు. పరీక్ష రాయడానికి తనను చాలామంది ప్రోత్సహించారని చెప్పారు.

By April 29, 2022 at 11:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-mla-angada-kanhar-appears-for-matric-exam-at-a-high-school/articleshow/91189426.cms

No comments