Breaking News

గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్!


పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత ఐ-ప్యాక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పలుసార్లు భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే గతేడాది యూపీలోని లఖింపూర్‌ ఖేరి హింసాకాండపై కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని హెచ్చరించారు.

By March 25, 2022 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/election-strategist-prashant-kishor-role-in-congress-mission-gujarat/articleshow/90431269.cms

No comments