Breaking News

ఉక్రెయిన్‌కు 70 కి.మీ దూరంలో జో బైడెన్.. అప్రమత్తమైన ఈయూ దేశాలు!


ఉక్రెయిన్‌ సరిహద్దు దేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాటో సమావేశం అనంతరం ఆయన పోలెండ్ చేరుకున్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని పంపిస్తున్నామని పశ్చిమ దేశాలు ప్రకటించాయి. కొన్ని వేల క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది. ఈయూ నేతలు కూడా మరో 55 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించడానికి సంతకాలు చేశారు. ఆంక్షలు తమపై ఎలాంటి ప్రభావం చూపబోవని చెప్పే ప్రయత్నంలో భాగంగా పరిమిత ట్రేడింగ్‌తో స్టాక్‌మార్కెట్‌ కార్యకలాపాలను రష్యా నిర్వహించింది.

By March 26, 2022 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-joe-biden-visits-poland-in-show-of-support-for-eastern-european-nations/articleshow/90453145.cms

No comments