Breaking News

Valimai Movie : అజిత్ ‘వలిమై’ సినిమా థియేటర్‌పై పెట్రొల్ బాంబులతో దాడి.. అసలు ఏం జరిగింది!


కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అజిత్ లేటెస్ట్ మూవీ ‘’. ఫిబ్రవరి 24న సినిమా విడుదలైంది. టాలీవుడ్ స్టార్ కార్తికేయ ఇందులో విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌లిమై విడుద‌లైన త‌ర్వాత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సంబ‌రాల్లో ఆప‌శ్రుతి చోటు చేసుకుంది. అస‌లు ఏం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే..కోయంబ‌త్తూరులోని గంగ వ‌ల్లి మ‌ల్టీప్లెక్స్‌లో అజిత్ వ‌లిమై సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో అనుకోకుండా ముగ్గురు దుండ‌గులు థియేట‌ర్‌లో పెట్రోల్ బాంబుల‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అభిమానుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ వ‌చ్చి స‌ద‌రు దుండ‌గులు బాంబుల‌తో దాడి చేశారు. వారిని ప‌ట్టుకోవ‌డానికి అజిత్ అభిమానులు ప్ర‌య‌త్నించారు. కానీ దుండ‌గులు త‌ప్పించుకున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని విచార‌ణ‌ను ప్రారంభించారు. అస‌లు ఇలా పెట్రోలు బాంబుల‌తో సినిమా రిలీజ్ రోజున దాడి చేయ‌డం అనేది అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. అజిత్ హీరోగా న‌టించిన వ‌లిమై చిత్రంలో టాలీవుడ్ స్టార్ కార్తికేయ సైకో విల‌న్‌గా న‌టించారు. హ్యుమా ఖురేషి కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. సినిమా యాక్ష‌న్ ప్ర‌ధానాంశంగా సాగే చిత్రం. బైక్ రేసింగ్ స‌న్నివేశాలు మెస్మ‌రైజ్ చేస్తున్నాయ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. జీ స్టూడియోతో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్ బ్యాన‌ర్‌పై బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కుడు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో వలిమై రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్ల తర్వాత అజిత్ హీరోగా నటించిన సినిమా విడుదలైంది. అజిత్ తదుపరి చిత్రం కూడా హెచ్.వినోద్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. వలిమై చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


By February 24, 2022 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/petrol-bomb-attacks-on-ajith-valimai-theatre-three-injured/articleshow/89789654.cms

No comments