Breaking News

International Project : పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్న పూరీ జగన్నాథ్..!


హీరోల‌ను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించి వారికి మాస్ ఇమేజ్‌ను అందించే ద‌ర్శ‌కుల్లో పూరీ జ‌గ‌న్నాథ్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇస్మార్ట్ శంక‌ర్‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్ ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌ను సిద్ధం చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ 25న సినిమా విడుద‌ల అవుతుంది. లైగ‌ర్ త‌ర్వాత మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే పూరీ జ‌గ‌న్నాథ్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ఓ అంత‌ర్జాతీయ మూవీని చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ఆ సినిమా ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని ఫైన‌లైజ్ అయిన త‌ర్వాత మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మారుతున్న తెలుగు సినిమా ట్రెండ్‌ను ఇప్పుడు ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువ‌గా పాన్ ఇండియా సినిమాల‌ను రూపొందిస్తున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ సినిమాల‌ను రూపొందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌ను చేస్తున్నారు. అదే స్పీడుతో ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారు. మ‌రి పూరీ జ‌గ‌న్నాథ్ ఎలాంటి సినిమా చేసి ఇంటర్నేష‌న‌ల్ రేంజ్‌లో స‌త్తా చాట‌బోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఛార్మి, బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి లైగ‌ర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అన‌న్య పాండే హీరోయిన్‌. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.


By February 21, 2022 at 09:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/after-janaganamana-puri-jagannadh-to-make-an-international-project/articleshow/89715226.cms

No comments