Breaking News

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన సొరంగం, శిథిలాల కింద కార్మికులు


మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలింది. శిథిలాల కింద ఇంకా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇప్పటికు ఐదుగురు కూలీలను రక్షించారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రాష్ట్ర డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సహాయంతో స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేకు “మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోని స్లీమనాబాద్‌లో బర్గి భూగర్భ కాలువ నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికుల్లో ఐదుగురిని రక్షించారు, నలుగురిని ఇంకా బయటకు తీసుకురావాల్సి ఉంది" అని స్థానిక అధికారి వెల్లడించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనడానికి SDERFబృందం జబల్‌పూర్ నుంచి వచ్చిందని కట్నీ జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా తెలిపారు. ఎస్పీ, కలెక్టర్ ఇద్దరూ సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా భూగర్భ సొరంగం నిర్మాణ పనుల్లో భాగంగా 70 అడుగుల లోతుకు కూలీలు తవ్వారు. ఈ క్రమంలో మట్టి ఒక్కసారిగా కూలిపోయింది.


By February 13, 2022 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/underground-tunnel-collapses-in-katni-caves-of-madhya-pradesh-five-labourers-rescued/articleshow/89538312.cms

No comments