Breaking News

మెడికల్ స్టూడెంట్స్‌కు తీపి కబురు… ఇక ప్రభుత్వ కాలేజీలతో సమానంగా ఫీజులు


ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించి ఫీజులు, ఇతర ఛార్జీల వసూళ్లపై జాతీయ వైద్య కమిషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ యూనివర్సిటీల్లో 50 శాతం సీట్ల ఫీజు ఆయా రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజుతో సమానంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ కోటా సీట్లను పొందిన అభ్యర్థులకు మొదట ఈ ప్రయోజనాన్ని అందించాలంది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సాధారణంగా ఫీజులు ఎక్కువగానే ఉంటాయి. దాంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ తాజా మార్గదర్శకాలతో దీని వల్ల ప్రభుత్వ కోటాలో సీట్లు పొందిన పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కట్టలేని విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ నిర్ణయంతో ఉపశమనం లభించ నుంది. అలాగే కొన్ని కాలేజీల్లో ప్రభుత్వ కోటా సీట్లు 50 శాతం కన్నా తక్కువగా ఉంటున్నాయి. అలాంటి చోట అర్హత పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా మిగతా విద్యార్థులను ఎంపిక చేసి ఈ ఫీజు ప్రయోజనాన్ని అందించాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. అలాగే విద్యార్థుల నుంచి క్యాపిటేషన్‌ రుసుములను వసూలు చేయవద్దని సూచించింది. విద్య లాభం కోసం కాదు అనే సూత్రానికి కచ్చితంగా కట్టుబడి ఉండేలా చూసుకోవాలని చెప్పింది. కాగా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, 2019 అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ప్రైవేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు డీమ్డ్ యూనివర్శిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించి ఫీజులు, ఇతర ఛార్జీల నిర్ణయం కోసం మార్గదర్శకాలను రూపొందించిస్తోంది.


By February 06, 2022 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nmc-new-guidelines-on-fees-for-50-percent-seats-in-private-medical-institutes/articleshow/89377882.cms

No comments