Breaking News

దేశంలో కొత్తగా 19,968 కేసులు నమోదు.. 673 మంది మృతి


దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 19,968 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా 673 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య దేశవ్యాప్తంగా 5,11,230 కి పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 60,298 మంది కోలుకున్నారు. ఈ మేరకు రికవరీ రేటు మళ్లీ 98 శాతం మార్కును దాటింది. ప్రస్తుతం దేశంలో 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. శనివారం ముంబైలో 201 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక మరణం నమోదైంది. ఇటు ఢిల్లీలో 635 తాజా కేసులు నమోదు కాగా కొత్తగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.13 శాతానికి పడిపోయింది. ఇక కేరళలో 6,757 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 1,137 మంది కొత్తగా కరోనాబారిన పడ్డారు. మహారాష్ట్రలో కొత్తగా 1,635 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 175.33 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. శనివారం కొత్తగా 30,81,336 మందికి టీకాలు అందించారు. టీనేజర్లకు కూడా వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంద. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.


By February 20, 2022 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-19968-cases-last-24-hours-with-673-deaths/articleshow/89698518.cms

No comments