Breaking News

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు.. డోర్సే రాజీనామా


గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థలో చేరిన పదేళ్లలోనే పరాగ్‌ అగర్వాల్‌ అత్యున్నత పదవిని చేపట్టడం విశేషం. భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005లో ఐఐటీ-బాంబే నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో 2011లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూ వంటి అంతర్జాతీయ సంస్థల్లో రిసెర్చ్‌ చేపట్టారు. 2011 అక్టోబరులో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా నియమితులయ్యారు. గత పదేళ్లుగా ట్విటర్‌లో పనిచేస్తున్నారు. ట్విట్టర్‌ టెక్నికల్‌ స్ట్రాటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కన్జ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్స్‌ల బాధ్యతలు చూస్తున్నారు. ట్విట్టర్ట్‌ ఇప్పటికే భారత సంతతికి చెందిన విజయ గడ్డే పాలసీ అండ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా, 16 ఏళ్లపాటు సీఈఓగా కొనసాగిన బాధ్యతల నుంచి తప్పుకుంటూ.. బోర్డు డైరెక్టర్లు తదుపరి సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ట్విట్టర్ వేదికగా ఓ లేఖను షేర్ చేశారు. సంస్థ తీసుకున్న క్లిష్టమైన నిర్ణయాల వెనుక పరాగ్ ఉన్నారని తెలిపారు. ‘‘అతను (అగర్వాల్) ఉత్సుకత, పరిశీలన, హేతుబద్ధమైన, సృజనాత్మక, డిమాండ్, స్వీయ-అవగాహన, వినయం.. అతను మనఃస్ఫూర్తిగా సంస్థను ముందుకు నడిపిస్తాడు.. నేను ప్రతిరోజూ విషయాలు నేర్చుకునే వ్యక్తి ఆయన. మా సీఈఓగా ఆయనపై నాకున్న నమ్మకం చాలా లోతుగా ఉంది’’అని తెలిపారు. తనను సీఈఓగా నియమించడం పట్ల పరాగ్ కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ‘‘పదేళ్ల కిందట నేను ఈ సంస్థలో చేరేటప్పుడు 1,000 మంది ఉద్యోగులు ఉండేవారు.. దశాబ్దం క్రితం అంటే ఆ రోజులు నాకు నిన్నలా అనిపిస్తున్నాయి. నేను మీ అడుగుజాడల్లో నడిచాను.. హెచ్చుతగ్గులు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను నేను చూశాను. కానీ అప్పుడు ఇప్పుడు, అన్నింటికీ మించి నేను ట్విట్టర్ అద్భుతమైన ప్రభావాన్ని, మా నిరంతర పురోగతిని, మన ముందున్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను... మా ఉద్దేశం అంతకన్నా ముఖ్యమైంది కాదు. మన ప్రజలు, మన సంస్కృతి ప్రపంచంలో దేనికదే భిన్నంగా ఉంటాయి. మనం కలిసి చేసేదానికి పరిమితి లేదు’’ అని అన్నారు.


By November 30, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-born-parag-agrawal-as-twitter-new-ceo-replaces-jack-dorsey/articleshow/87994020.cms

No comments