Breaking News

నాలుగేళ్లలో 8 మందిని పెళ్లాడిన ‘కి’లేడీ.. వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ పాజిటివ్!


భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ.. పెళ్లిళ్ల పేరుతో మోసాలకు తెరతీసింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. వారితో 10-15 రోజులు కాపురం చేసి, తర్వాత గొడవ పెట్టుకుని ఆభరణాలు, నగదుతో ఉడాయించడం ఆ కిలేడీ వ్యాపారం. నాలుగేళ్లలో ఎనిమిది ఆమె చేతిలో మోసపోయారు. తాజాగా, తొమ్మిదో పెళ్లికి సిద్ధమవ్వగా ఆమె బాగోతం బయటపడింది. ఈ ఘటన పంజాబ్‌లో వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలు విని పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయి. తన మోసాలను నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హరియాణలోని కైతల్‌ జిల్లాకు చెందిన ఆ నిందితురాలికి (30) 2010లో వివాహం జరగ్గా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సంపాదన కోసం మోసాలకు తెర తీసిందని పోలీసులు తెలిపారు. ఆమె మోసాలకు కన్నతల్లి, కొంత మంది బంధువులు సహకరించినట్టు తేలింది. పంజాబ్‌, హరియాణల్లో ఈ కిలేడీ చేతిలో చాలామంది మోసపోయారు. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె పాత భర్తలందరికీ కూడా త్వరలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లలో ఎనిమిది మందిని పెళ్లిచేసుకుని, వారం కాపురం చేసిన తర్వాత వారి ఇంటిలోని నగలు, ఆభరణాలు, డబ్బులు తీసుకుని వెళ్లిపోయేదని పోలీసులు చెప్పారు. ఒకవేళ తన వలలో పడిన వ్యక్తికి డబ్బులు, విలాసవంతమైన భవనం ఉంటే 10 నుంచి 15 రోజులు అతడితో ఉండేది. అనంతరం వారితో గొడవపెట్టుకుని వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేది. ఆమె బెదిరింపులకు అత్తింటివారు లొంగకపోతే తన ముఠా సభ్యుల సహాయ సహకారంతో ఇంటిని దోచుకునేది. ‘బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన తర్వాత అక్కడ నుంచి అదృశ్యమవుతుంది... విడాకులు తీసుకున్నవారు లేదా మధ్యవయసులో ఉన్న వ్యక్తులను ముగ్గులోకి దింపి.. తర్వాత పెళ్లిచేసుకునేలా ప్రేరేపించేది.. పటియాలాకు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోడానికి ప్రయత్నించగా ఆమె వ్యవహారం బయటపడింది’ అని పోలీస్ అధికారి తెలిపారు. నాలుగేళ్ల కిందట ఆమెను భర్త వదిలి వెళ్లిపోయాడని చెప్పారు.


By September 03, 2021 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/runaway-woman-who-married-8-men-tests-hiv-positive-in-punjab-and-haryana/articleshow/85888097.cms

No comments