Breaking News

ప్రముఖ రాజకీయ పార్టీలకు షాక్... సుప్రీంకోర్టు జరిమానా


రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. భారీ చర్యలు తీసుకుంది. బీజేపీ-కాంగ్రెస్‌ సహా ఎనిమిది రాజకీయ పార్టీలకు జరిమానా విధించింది. అభ్యర్థులపై క్రిమినల్ కేసులను పబ్లిక్ చేయకుండా పోటీ చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంది. బీహార్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల నేర చరిత్రను బహిరంగ పరచాలనే కోర్టు ఆదేశాలను పాటించనందుకు బీజేపీ మరియు కాంగ్రెస్‌లకు చెరో లక్ష రూపాయలు మరియు ఎన్‌సిపి, సీపీఎంలకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. బీహార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, ఎన్‌సీపీ, సీపీఎం సహా అనేక పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై క్రిమినల్ కేసుల గురించి బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ పార్టీలపై చర్యలు తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థులు ఎంతమంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారో పార్టీలు ప్రకటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఆర్ఎస్ఎల్పీ, ఎల్‌జీపీ లకు లక్ష రూపాయల జరిమానా విధించింది కోర్టు. సీపీఎం , ఎన్సీపీలకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్ల హోమ్‌పేజీలో ప్రచురించాలని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి పార్టీ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో తప్పనిసరిగా కాలమ్ చేర్చాలని ఆదేశించింది. కోర్టు విజ్ఞప్తులన్నీ తమకు చేరలేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. రాజకీయ పార్టీలు నిద్ర నుంచి మేల్కొనేందుకు సిద్ధంగా లేవని పేర్కొంది. రాజకీయాల్లోని వ్యక్తులు మేల్కొని రాజకీయాల్లో నేరాలను ఆపడానికి ముందడుగు వెయ్యాలని సుప్రీంకోర్టు సూచించింది.


By August 11, 2021 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-fines-parties-over-criminal-candidates/articleshow/85231029.cms

No comments