Breaking News

సీఎం మేనల్లుడి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు


పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ () పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాన్వాయ్‌పై సోమవారం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. త్రిపుర పర్యటనకు వచ్చిన ఆయనను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. త్రిపుర రాజధాని అగర్తల విమానాశ్రయం నుంచి త్రిపురేశ్వరి ఆలయానికి వెళ్తున్న అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌ను పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. తొలుత పశ్చిమ త్రిపుర జిల్లా చారిలామ్ వద్ద అడ్డుకుని, రహదారి దిగ్బంధించే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలే తన వాహనంపై కర్రలతో దాడికి పాల్పడ్డారంటూ అభిషేక్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎంపీ వాహనంపై.. బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ‘బీజేపీ పాలనలో.. త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. రాష్ట్రాన్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు’ అంటూ సీఎం బిప్లబ్‌ దేవ్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘటనపై టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ స్పందించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన తెలిపారు. 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావిస్తోన్న టీఎంసీ.. ఆ వ్యూహంలో భాగంగా అక్కడ అభిషేక్‌ బెనర్జీ పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్‌ సభ్యులను అగర్తలలో ఇటీవల పోలీసులు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు సహా కీలక నేతలు త్రిపురలో పర్యటించారు. వారిని నిర్బంధించడం చట్టవిరుద్ధమంటూ విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు 22 మందితో కూడిన బృందం అగర్తలకు వెళ్లింది. ఈ మేరకు ఆ బృందంలోని సభ్యులు వెల్లడించారు. అక్కడ తాము బస చేసిన హోటల్‌ నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు.


By August 03, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-benerjee-nephew-abhishek-banerjee-faces-bjp-protest-in-tripura/articleshow/84993943.cms

No comments