Breaking News

మాజీ కోడల్ని పెళ్లాడిన మామ.. విడిపోయిన భార్యే సవతి తల్లిని తెలిసి షాక్!


తనను వివాహం చేసుకుని వదిలేసిన యువతే... తండ్రిని రెండో పెళ్లిచేసుకుని సవతి తల్లిగా వచ్చింది. ఈ అనూహ్య సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బదాయ్‌కు చెందిన ఓ యువకుడు.. ఇల్లు వదిలివెళ్లిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేశాడు. అధికారుల అన్వేషణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఆ తండ్రి.. తన మాజీ కోడల్ని వివాహం చేసుకుని, ఆమెతో కలిసి జీవిస్తున్నట్టు తేలింది. దీంతో అసలు విషయం తెలిసి యువకుడు షాక్ తిన్నాడు. సదరు యువకుడి, ఆమె 2016లోనే మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లిచేసుకున్నారు. అయితే, 6 నెలల తర్వాత భర్త తాగుబోతంటూ ఆమె వదిలేసింది. రాజీకోసం యువకుడు ఎంతగా ప్రయత్నించినా ఆమె మాత్రం ససేమిరా అంది. ఇది జరిగిన కొంతకాలానికి ఆ యువకుడి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ కోసం గాలించిన యువకుడు.. ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. తనను వదిలేసిన మహిళను తండ్రి పెళ్లిచేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయాడు. మాజీ భార్య ప్రస్తుతం తనకు సవతి తల్లి కావడంతో షాక్‌ తిన్నాడు. తాను పెళ్లిచేసుకున్న అమ్మాయిని తండ్రి (48) తిరిగి వివాహం చేసుకుని సంభాల్‌ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీంతో తండ్రి, తన మాజీ భార్యపై ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మాత్రం రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని, మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై పోలీసులు మాట్లాడుతూ.. తండ్రీ కొడుకుల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించామని తెలిపారు. శనివారం ఇరువుర్నీ సమావేశపరచగా.. తీవ్ర వాగ్వాదం జరిగిందన్నారు. యువకుడి ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాదాయ్ సర్కిల్ ఆఫీసర్ వినయ్ చౌహన్ అన్నారు. మొదటి భర్తతో వెళ్లడానికి ఆమె నిరాకరించిందని తెలిపారు. ‘‘మైనర్లుగా ఉన్నప్పుడే వివాహం చేసుకోవడం దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు.. దీనిపై కేసు నమోదుచేయలేదు.. ఇరు వర్గాలకు తదుపరి కౌన్సిలింగ్ కోసం నోటీసులు ఇస్తాం’’అని అన్నారు.


By July 05, 2021 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/father-married-his-sons-ex-wife-in-uttar-pradesh/articleshow/84134991.cms

No comments