Breaking News

'మ‌హా స‌ముద్రం' కంప్లీట్.. పిడికిలి బిగించిన ఇద్దరు హీరోలు! ఎనిమిదేళ్ళకు మళ్ళీ..


శ‌ర్వానంద్‌, హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహా సముద్రం'. రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలుపుతూ 'మహా సముద్రం' కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. షూట్ ఎంత ఆనందంగా గ‌డిచిందో తెలిపేలా విశాఖ తీరాన శర్వానంద్, సిద్ధార్థ్ పిడికిలి బిగించి న‌వ్వుతూ ఈ పోస్టర్‌లో కనిపించారు. 'మహా సముద్రం' షూటింగ్ కంప్లీట్ చేశామని తెలుపుతూ ట్వీట్ పెట్టిన హీరో సిద్దార్థ్.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు తెరపై అడుగుపెట్టబోతున్నా. ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ ఎంజాయ్ చేశా అని పేర్కొన్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌ చేసిన , సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ లుక్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సీనియర్ నటుడు జగపతి బాబు డిఫరెంట్ యాంగిల్‌లో కనిపించబోతున్నారని టాక్. ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు మేకర్స్.


By July 09, 2021 at 01:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sharwanands-maha-samudram-shooting-finished/articleshow/84261466.cms

No comments