Breaking News

ఎంతటి నిర్లక్ష్యం.. అదీ ప్రభుత్వ తీరు.. అనుపమ వల్ల బయటపడ్డ గుట్టు!


ఒక్కోసారి సోషల్ మీడియా కొన్ని తప్పులను వెంటనే పసిగడుతుంటుంది. ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియా వెంటనే పట్టుకుంటుంది. అలా కొన్ని ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యలను ఎండగడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పరీక్షలు, ఉద్యోగాలు, మార్కుల జాబితా వంటి వాటిలో దొర్లే తప్పులను సోషల్ మీడియా కనిపెడుతుంది. సెలెబ్రిటీలు పేర్లు, ఫోటోలతో మార్కుల జాబితాలు వస్తుంటాయి. వాటిని సోషల్ మీడియాలోని నెటిజన్లు ఇట్టే పసిగట్టేసి ప్రభుత్వాల నిర్లక్ష్యపు దోరణిని ఎండగడుతుంటారు. తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఆమె పరీక్షకు హాజరుకాకుండానే బిహార్‌ రాష్ట్రం నిర్వహించిన సెకండరీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌.టి.ఇ.టి) పాసైంది. అది ఎలా సాధ్యమైందని అనుకోకండి. అక్కడ అలానే జరుగుతూ ఉంటుంది. ఇదేమీ మొదటి సారి కూడా కాదు. ఇంతకుముందు ఎన్నో సార్లు సెలెబ్రిటీల పేర్లు, ఫోటోల మీద అక్కడ ఫలితాలు వచ్చాయి. అయితే తాజాగా ఫోటో వచ్చింది. బిహార్‌ విద్యా శాఖ 2019లో నిర్వహించిన ఎస్‌.టి.ఇ.టి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సంబంధిత వెబ్‌సైట్‌లో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగా అందులో నటి అనుపమ ఫొటో తన కంటపడింది. వ్యక్తిగత వివరాలన్నీ తనవే ఉన్నా ఫొటో మాత్రం అనుపమది ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దాంతో ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రిషికేశ్‌. ప్రస్తుతం అనుపమ ఫొటో ఉన్న స్కోర్‌ కార్డు నెట్టింట వైరల్‌ అవుతోంది. సదరు వ్యక్తి మ్యాథ్స్‌ పేపర్‌ 1లో 150కిగాను 77, పేపర్‌ 2లో 95 మార్కులు సంపాదించారు. దీన్ని చూసిన నెటిజన్లు అవి అనుపమ సాధించిన మార్కులంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు బిహార్‌కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు తప్పిదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వెలువడిన జూనియర్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఫలితాల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ 98.5 మార్కులు తెచ్చుకున్నట్టుగా ఫలితాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే.


By June 26, 2021 at 10:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anupama-parameswaran-in-bihar-stet-exam/articleshow/83864532.cms

No comments