Breaking News

ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రాణాలకే ముప్పు.. WHO సంచలన అధ్యయనం


కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరింత వేగాన్ని అందుకోవాలనే ధోరణితో ఎక్కువ గంటలు పనిచేయడం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ () హెచ్చరించింది. ఏడాదిలో వేలాది మంది ప్రాణాలను బలితీసుకోడానికి కారణమయ్యిందని పేర్కొంది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే నష్టాలపై ప్రపంచంలో తొలిసారిగా నిర్వహించిన అధ్యయన ఫలితాలను ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం.. ఎక్కువ గంటల పని చేయడం వల్ల 2016లో గుండె పోటు, హృదయ సంబంధిత వ్యాధులతో 745,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది 2000 ఏడాదితో పోల్చితే 30 శాతం అధికం. ‘‘వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది’’ అని డబ్ల్యూహెచ్ఓ పర్యావరణ, వాతావరణ మార్పులు-ఆరోగ్య విభాగం డైరెక్టర్ మారియా నీరా పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా మరిన్ని చర్యలను ప్రోత్సహించడం, కార్మికులకు మరింత రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. ఈ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) సంయుక్తగా చేపట్టాయి. బాధితుల్లో 72 శాతం మంది మధ్య వయస్కులు లేదా వృద్ధులే ఉన్నారు. తరచుగా సంభవించే మరణాలు కొన్ని దశాబ్దాల తరువాత షిఫ్టులు పనిచేసిన దానికంటే ఎక్కువ సంభవించాయి. చైనా, జపాన్, ఆస్ట్రేలియా సహా ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావితమైనట్టు డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ప్రపంచంలోని మొత్తం 194 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసేవారితో పోల్చితే 55 లేదా అంత కంటే ఎక్కువ గంటలు పనిచేసేవారిలో 35 శాతం అధికంగా గుండెపోటు ముప్పు, 17 శాతం అధికంగా హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ అధ్యయనానికి 2000-2016 మధ్య కాలాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి కోవిడ్-19 మహమ్మారి సమయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కోవిడ్ అత్యవసర పరిస్థితి, పని గంటలు పెరుగుదల ప్రపంచ ఆర్ధిక మందగమనం ప్రమాదాన్ని పెంచిందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలిపారు. ‘‘మహమ్మారి ఎక్కువ సమయం పనిచేసే ధోరణి పరిణామాలను వేగవంతం చేస్తోంది.. కనీసం 9 శాతం మంది ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు’’ అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘ్యాబ్రియేసిస్‌ సహా సిబ్బింది మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని నీరా పేర్కొన్నారు. కార్మికుల ఉత్పాదకతను పెంచుతుందని తేలినందున ఎక్కువ పని గంటల వల్ల యజమాన్యాలకు ప్రయోజనం కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక అధికారి ఫ్రాంక్ పెగా చెప్పారు. ‘ఆర్థిక సంక్షోభం సమయంలో పని గంటలు పెంచకూడదనేది నిజంగా మంచి నిర్ణయం’’ అని వ్యాఖ్యానించారు.


By May 17, 2021 at 01:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/long-working-hours-are-a-killer-who-and-ilo-study-shows/articleshow/82703931.cms

No comments