బీజేపీ నేతపై మండిపడ్డ సిద్దార్త్.. ‘సిగ్గుండాలి రా.. వెళ్లి పడుకో’ అంటూ ఘాటుగా ట్వీట్

హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సరైన హిట్లు లేకపోవడంతో.. అతను ఇండస్ట్రీ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే సిద్ధార్త్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా అతను స్పందిస్తుంటాడు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా అతను ఈ మధ్యకాలంలో ట్వీట్లు చేయడం ప్రారంభించాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీనే కారణమంటూ.. అతను ట్వీట్లు చేశాడు. దీంతో ఆ పార్టీ నేతల నుంచి సిద్ధార్త్కు వ్యతిరేకత ఏర్పడింది. సిద్ధార్త్ను టార్గెట్ చేస్తూ.. ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తనను, తన కుటుంబాన్ని హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామంటూ.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ.. బీజేపీ నేతలే తనని బెదిరిస్తున్నారంటూ సిద్దార్త్ రీసెంట్గా ట్వీట్ చేశాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే దీనిపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా స్పందించారు. సిద్ధార్త్ కావాలనే తమ పార్టీ నేతలు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు తెలిపారు. ఇటీవల బీజేపీ యువ మోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్యను టార్గెట్ చేస్తూ సిద్ధార్త్ ఒక ట్వీట్ చేశాడు. తేజస్వీ సూర్య.. అజ్మల్ కసబ్ కంటే ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అంటూ అతను పేర్కొన్నాడు. దీనిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ ట్వీట్పై యాక్షన్ తీసుకోవాలంటూ.. ట్విట్టర్ని కోరిన ఆయన సిద్ధార్త్ సినిమాలు అన్నింటికీ.. దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తాడట.. నిజమేనా..! ఆయన పేర్కొన్నారు. దీనిపై సిద్ధార్త్ ఘాటుగా స్పందించాడు. ‘‘నో రా, నాకు టీడీఎస్ ఇవ్వడానికి అతను సిద్ధంగా లేడు. నేను చాలా నిజాయితీ గత పౌరుడిని, పన్ను చెల్లింపుదారుడిని కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంటా. సిగ్గుండాలి’’ అంటూ సిద్ధార్త్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
By May 07, 2021 at 12:09PM
No comments