Breaking News

పీఎంవో విఫలమైంది.. గడ్కరీకి ఛాన్స్ ఇస్తే బెటర్: సుబ్రమణ్యస్వామి


ఇస్లామిక్ చొర‌బాటుదారులు, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల‌ను ఎదురించి నిలిచిన‌ట్లే ఇండియా క‌రోనా మ‌హ‌మ్మారిపై కూడా విజ‌యం సాధిస్తుందని అన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ . కరోనా కట్టడికి ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో కరోనా వేవ్‌ను చూడాల్సి వస్తుందన్నారు. అందుకే ఇప్పుడు కరోనాపై పోరు బాధ్యతలను నితిన్ గడ్కరీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పీఎంవోపై ఆధారపడటం దండగని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు పూర్తి స్వేచ్ఛ లేదని పేర్కొన్న సుబ్రమణ్యస్వామి... ప్రస్తుత పరిస్థితుల్లో నితిన్ గడ్కరీ సామర్ధ్యం పనికొస్తుందన్నారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్‌ ఇచ్చిన సలహాకు స్పందించిన ఆయన.. తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని విమర్శిస్తున్నానే తప్ప ప్రధానమంత్రిని కాదని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేకపోవడం వల్లే ఆయన ఏమీ చేయలేకపోతున్నారన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుడటం, మరోపక్క ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.


By May 05, 2021 at 04:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pmo-useless-make-nitin-gadkari-in-charge-of-covid-19-battle-says-subramanian-swamy/articleshow/82405121.cms

No comments