Breaking News

Bengal CM నన్ను అరెస్ట్ చేయండి.. నేరుగా సీబీఐకి ఆఫీస్‌కు వెళ్లి దీదీ సవాల్


ముఖ్యమంత్రి క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడంతో పశ్చిమ్ బెంగాల్‌లో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రుల అరెస్ట్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న మమతా.. దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. నరాడా టేపుల వ్యవహారంలో మంత్రులు ఫర్హీద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సోమవారం ఉదయం సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ‘‘సరైన కారణాలు లేకుండా మంత్రుల అరెస్ట్ చేశారు.. సీబీఐ నన్ను కూడా అరెస్ట్ చేయాలి’’ అని దీదీ మండిపడ్డారు. తృణమూల్ పార్టీ లాయర్ అనిద్యా రౌత్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో 45 నిమిషాలపాటు ఉన్నారు.. ఇదే సమయంలో టీఎంసీ నేతలు ఆఫీసు బయటకు ఆందోళన చేశారన్నారు. సోమవారం ఉదయం మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీల నివాసాలకు చేరుకున్న సీబీఐ అధికారులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ వరుసగా మూడోసారి విజయం సాధించిన తర్వాత అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి ఫిర్హాద్ హకీమ్‌ను సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన నివాసంలోనే అరెస్ చేశారు. ఎటువంటి నోటీసు జారీచేయకుండానే తనను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. నరాడా టేపుల వ్యవహారంలో ఈ నలుగురిపై సీబీఐ దర్యాప్తునకు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ఇటీవల ఆమోదం తెలిపారు. అయితే, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలంటే తొలుత స్పీకర్ అనుమతి తీసుకోవాలి. కానీ, సీబీఐ అలా చేయకుండా నేరుగా గవర్నర్‌ను సంప్రదించింది. ఈ ఏడాది జనవరిలోనే గవర్నర్‌ అనుమతి కోరింది. ప్రస్తుతం సీబీఐ అదుపులోకి తీసుకున్న నలుగురూ గతంలో మమతా మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. కేసులో మొత్తం 12 మంది టీఎంసీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు ముకుల్ రాయ్, ఎమ్మెల్యే సువేందు అధికారి బీజేపీలో ఉన్నారు. అయితే, ఈ ఇద్దర్నీ సీబీఐ అదుపులోకి తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకుంది.


By May 17, 2021 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-fires-on-cbi-for-ministers-arrest-in-bribery-case/articleshow/82702421.cms

No comments