Breaking News

రాధేశ్యామ్ యూనిట్‌లో కరోనా కలకలం.. క్వారంటైన్‌లో ప్రభాస్! రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో టెన్షన్..


క్రమంగా కరోనా ప్రభావం సినీ రంగంపై ఎక్కువవుతోంది. గతేడాది ఇదే కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలలపాటు సినిమా షూటింగ్స్ రద్దయి ఎక్కడి మూవీస్ అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అదే రీపీట్ కానుందని స్పష్టమవుతోంది. కరోనా వేవ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారినపడగా, ఇప్పుడు ఆ మహమ్మారి వైరస్ '' యూనిట్‌ని తాకింది. ఇప్పటికే కరోనా కారణంగా ''ఆచార్య, పుష్ప, RRR'' సినిమా షూటింగ్స్ వాయిదాపడగా తాజాగా ఆ జాబితాలో 'రాధేశ్యామ్' కూడా చేరింది. మేకప్‌మ్యాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే షూటింగ్ నిలిపివేశారట. మేకప్ మ్యాన్‌కు కరోనా అని తెలియగానే షూటింగ్ నిలిపివేయాలని ప్రభాస్ కోరారట. మరోవైపు ప్రభాస్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రభాస్ చేస్తున్న మిగితా సినిమాలు ''సలార్, ఆదిపురుష్'' షూటింగ్స్ ఇప్పటికే రద్దు చేయగా ఇప్పుడు రాధేశ్యామ్ కూడా ఆ లిస్టులో చేరిపోయింది. నిజానికి రాధేశ్యామ్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అడుగడుగునా అవాంతరాలు ఎదురుకావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎలాగోలా ఇక షూటింగ్ చివరిదశకు వచ్చింది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనంద పడేలోగానే మరోసారి కరోనా కాటేసింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో ప్రభాస్ జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ డేట్‌పై సందేహాలు నెలకొన్నాయి.


By April 22, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-radhe-shyam-shooting-cancelled-by-corona-effect/articleshow/82190525.cms

No comments