Breaking News

చేతివాటంతో 4 కోట్లు కొట్టేసిన బ్యాంకు సెక్యూరిటీ.. సీసీటీవీలో షాకింగ్ వాస్తవాలు!


యాక్సిస్ బ్యాంకులో రూ. 4 కోట్ల చోరీ అయిన ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. చోరీ జరిగిన బ్రాంచ్ నుంచే నగరంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తుంటారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి సిద్దంగా ఉంచి ఓ బాక్సును నిందితుడు ఎత్తుకెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. గత మూడేళ్ల నుంచి ఈ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సుమిత్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 34 బ్రాంచ్‌లో రూ.4 కోట్ల చోరీకి గురయ్యాయి. రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకును తెరవలేదని, నిందితుడు సుమిత్‌తోపాటు పంజాబ్ పోలీస్ విభాగం కానిస్టేబుల్ రాత్రి షిఫ్ట్‌లో ఉన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వచ్చి ఆదివారం ఉదయం 6 గంటలకు విధులు ముగించుకుని వెళ్లిపోయాడు. బ్రాంచ్ వెలుపల సెక్యూరిటీ కోసం పోలీసులను నియమించడంతో సుమిత్ సెక్యూరిటీ ఇంఛార్జ్‌గా ఉన్నాడు. దీంతో నగదు దొంగలించడం అతడికి సులభమయ్యిందని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సుమిత్ అదృశ్యం కావడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పోలీసులను అప్రమత్తం చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బ్యాంకులోని నగదు పెట్టెను తెరిచి అందులో నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తర్వాత రూ.4 కోట్లు నగదు చోరీకి గురయినట్టు తెలిపారు. ట్రంక్ పెట్టెను సుమిత్ తెరిచి అందులోని నగదును తన దుస్తుల్లో నింపుకుని తీసుకెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయ్యింది. అనంతరం తన వాహనంపై అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. చండీగఢ్ ఎస్పీ కుల్‌దీప్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. అతడి మొబైల్ ప్రస్తుతం స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్నట్టు తెలిపారు.


By April 12, 2021 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/security-guard-flees-with-4-crore-from-axis-bank-in-chandigarh/articleshow/82025130.cms

No comments