Breaking News

ఆక్సిజన్ కొరతతో వేర్వేరు ఆస్పత్రుల్లో 12 మంది మృతి


విలయానికి దేశం చిగురుటాకులా వణుకుతోంది. ఆక్సిజన్ అందక డజన్ల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి చోట్ల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదువుతున్నాయి. ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, థానేలోని వేదాంత్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. నాసిక్ ఆస్పత్రిలో గతవారం ఆక్సిజన్ ట్యాంకర్‌ లీకయి సరఫరా నిలిచిపోవడంతో 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోనూ రెండు ఆస్పత్రుల్లో 50 మంది ప్రాణవాయువు అందక చనిపోయారు. హరియాణాలోని హిసార్‌లో సోమవారం ఉదయం ఐదుగురు కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక మృతిచెందారు. ఆ రాష్ట్రంలో ఇది మూడో ఘటన. ఆదివారం గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో నలుగురు, రేవారీలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నలుగురికి ఆక్సిజన్ అందక ఊపిరాగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా మహారాజ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఇద్దరు రోగులు చనిపోయారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని... ఈ మృతికి కాదని అధికారులు అంటున్నారు. కరోనాతోనే మృతిచెందారని చెబుతున్నాయి. అయితే, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తడంతో తమవారు చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.


By April 26, 2021 at 01:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-from-maharashtra-five-in-haryana-dies-allegadly-due-to-oxygen-shortage/articleshow/82255432.cms

No comments