Breaking News

హాస్టల్‌లోకి దూరి దుస్తులు విప్పించి బాలికలతో నగ్నంగా డ్యాన్స్‌లు.. పోలీసుల దుశ్చర్య!


ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులే రాక్షసుల మాదిరిగా ప్రవర్తించారు. ఓ బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి, బలవంతంగా వారి దుస్తులు విప్పించి, వారితో నగ్నంగా డ్యాన్స్ చేయించారు. ఓ కేసు విచారణ పేరుతో పోలీసులు వికృత చర్యలకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం ప్రకటించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, దీనికి బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నలుగురు అధికారులతో అత్యున్నత కమిటీ ఏర్పాటుచేశామని, రెండు రోజుల్లో నివేదికను అందజేయాలని కోరినట్టు హోం మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి, మొత్తం వీడియో రికార్డింగ్, ఇతర సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేస్తామన్నారు. అయితే, ఈ అంశం చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియ్‌స్ తీసుకోవడం లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్‌ ముంగటివార్ అసెంబ్లీలో ఆరోపించారు. అలాగే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల వద్ద ఉందన్నారు. ‘రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన తరువాత కూడా పోలీసు యంత్రాంగం సమాచారం తీసుకోకపోతే, ఈ ప్రభుత్వం ఎందుకు (అప్పుడు అవసరం)’ అని సుధీర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. ఓ కేసు విచారణ పేరుతో కొందరు బయట వ్యక్తులు, పోలీసులు తమ హాస్టల్‌లోకి ప్రవేశించారని బాలికలు తెలిపారు. కొందరి బాలికలతో బలవంతంగా దుస్తులు విప్పించి, నగ్నంగా డ్యాన్స్ చేయించారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.


By March 04, 2021 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/girls-allegedly-stripped-and-made-to-dance-by-maharashtra-police/articleshow/81322412.cms

No comments