Breaking News

టీకా తీసుకున్న తర్వాత సిస్టర్ నివేదాతో ప్రధాని ఏమన్నారంటే?


దేశంలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 45 ఏళ్లు దాటిన వ్యక్తులకు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా సైతం ఢిల్లీ ఎయిమ్స్‌లో టీకా తీసుకున్నారు. ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా ప్రధానికి టీకా ఇచ్చారు. కేరళకు చెందిన మరో సిస్టర్ రోసమ్మ అనిల్ కూడా ప్రధానికి టీకా వేసినప్పుడు అక్కడన్నారు. కోవిడ్ వేసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని.. ఫోటోను కూడా షేర్ చేశారు. పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా.. గత మూడేళ్లుగా ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. టీకా వేసుకోడానికి ప్రధాని వస్తున్నట్టు ఈ ఉదయమే తనకు తెలిసిందని నివేదా అన్నారు. ‘టీకా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నాను.. ప్రధాని గారు ఈ రోజు వస్తున్నారని చెప్పారు.. ప్రధానిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని నివేదా ఆనందం వ్యక్తం చేశారు. ‘వ్యాక్సిన్ వేసినట్టు తెలియలేదు.... నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని టీకా తొలి డోస్ వేసిన తర్వాత ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. రెండో డోస్ 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తమతో మాట్లాడిన ప్రధాని, ఏ రాష్ట్రానికి చెందినవారని అడిగారని అన్నారు. మరో నర్స్ రోసమ్మ అనిల్ మాట్లాడుతూ.. ‘టీకా వేసుకున్న తర్వాత ప్రధాని చాలా సౌకర్యవంతంగా ఉన్నారు.. ఇది చాలా సంతోషకరమని’ వ్యాఖ్యానించారు. ఇక, టీకా వేసుకోడానికి ఎయిమ్స్‌కు వచ్చేటప్పుడు తన మెడలో అసోంలో తయారైన కండువాను మోదీ ధరించారు. అలాగే, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయాన్ని ఎయిమ్స్‌కి చేరుకోవడం విశేషం. మరోవైపు, భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్‌ను ప్రధాని మోదీ తీసుకుని దానిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ జరగకుండా టీకాకు అనుమతించడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ టీకానే మోదీ తీసుకున్నారు.


By March 01, 2021 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/what-pm-modi-told-nurse-niveda-after-receiving-covid-vaccine/articleshow/81268392.cms

No comments