Breaking News

వాటిపై మోదీ ఫోటోలు కోడ్ ఉల్లంఘనే.. తొలగించండి: బీజేపీకి ఈసీ షాక్!


అసెంబ్లీ ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనలకు సంబంధించి కేంద్ర (ఈసీ) బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలతో కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఈ మేరకు ఈసీ స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు గత శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం, పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను వినియోగిస్తున్నారని, ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని టీఎంసీ తన ఫిర్యాదులో కోరింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోదీ ఫోటోలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. బెంగాల్‌ అసెంబ్లీకి మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలి దశ పోలింగ్ మార్చి 27న జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఇక, మమతా బెనర్జీ పార్టీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ జాబితాను మార్చి 5న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బరిలోకి దిగే మొత్తం 294 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భోగట్టా.


By March 04, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-photo-in-petrol-pump-hoardings-violates-poll-code-election-commission/articleshow/81323418.cms

No comments