Breaking News

75 వారాలపాటు 75వ స్వాతంత్ర వేడుకలు: నేటి నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్


తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకలను శుక్రవారం ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి నిర్వహించే పాదయాత్రను మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ.. సబర్మతి ఆశ్రమం నుంచి నిర్వహించే పాదయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాగనున్నాయని వివరించారు. మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయన్నారు. స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 241 మైళ్ల దూరం పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర తొలి 75 కిలోమీటర్లకు తాను నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పాదయాత్ర 25 రోజులు పాటు సాగి ఏప్రిల్ 5న దండిలో ముగియనుందని అన్నారు. వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ఇవి శుక్రవారం ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు.


By March 12, 2021 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-to-inaugurate-azadi-ka-amrut-mahotsav-in-ahmedabad-today/articleshow/81459114.cms

No comments