Breaking News

మూడేళ్లుగా టిక్కెట్లు కొనుగోలు.. లాటరీలో రూ.24 కోట్లు గెలిచిన భారతీయుడు!


యూఏఈ లాటరీలో ఇప్పటికే పలువురు భారతీయులు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరో భారతీయుడికి ఆ అదృష్టం వరించింది. యూఏఈలో నివాసం ఉంటున్న ఓ భారతీయుడు భారీ మొత్తంలో నగదు గెలుచుకున్నాడు. మొత్తం 12 మిలియన్ల దిర్హమ్‌ల (రూ.24 కోట్లు)ను లాటరీలో సొంతం చేసుకున్నాడు. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన యూఈఏ లాటరీలో విజేతగా నిలిచాడు. మెకానికల్‌ ఇంజనీర్‌‌ అయిన శివమూర్తి.. గత 15 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటున్నారు. ఆయన కొనుగోలు చేసిన 202511 టిక్కెట్‌కు లాటరీ తగిలింది. ఫిబ్రవరి 17న జరిగిన డ్రాలో భారతీయుడు శివమూర్తి కృష్ణప్ప విజేతగా నిలిచినట్టు గల్ఫ్‌ న్యూస్‌ గురువారం తెలిపింది. లాటరీలో విజేతగా నిలిచినందుకు కృష్ణప్ప ఆనందంతో ఉబ్బితబ్బుబి అవుతున్నాడు. ఈ మొత్తంతో తన స్వగ్రామంలో తన కుటుంబానికి ఒక పెద్ద ఇల్లు నిర్మించాలనుకుంటున్న చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌ కోసం ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేస్తానన్నారు. లాటరీ డ్రాను ప్రత్యక్షంగా ఇంటి నుంచి వీక్షించిన కృష్ణప్ప.. తాను కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీ తగలడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం లాటరీ నిర్వాహకులు శివమూర్తికి ఫోన్ చేసి విజేతగా నిలిచినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తాను లైవ్‌లో చూసిన విషయాన్ని వారితో చెప్పానని, ఇది తనకు నమ్మశక్యంగా లేదని వివరించారు. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. గతంలో స్నేహితులతో కలిసి టిక్కెట్లు కొనుగోలు చేసిన కృష్ణప్ప.. ఏడాది నుంచి విడిగా కొంటున్నాడు. ఈ సారి నిర్వహాకులు ప్రత్యేక ఆఫర్ ఇవ్వడంతో తాను రెండు టిక్కెట్లు కొనుగోలు చేసినట్టు వివరించాడు. ఇదిలా ఉండగా, బిగ్ టికెట్ నిర్వహకులు లక్కీ డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. నేరుగా ఇంటి నుంచి వినియోగదారులు చూసేందుకు వీలు కలుగుతుందని, అందుకే ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించామని తెలిపారు.


By March 05, 2021 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-man-shivamurthy-krishnappa-wins-rs-24-crore-in-uae-lottery-lucky-draw/articleshow/81341896.cms

No comments