Breaking News

కారును ఢీకొట్టిన ఆయిలర్ ట్యాంకర్.. ఏడుగురు మృతి


ఉత్తర్‌ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యమున ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందిన మథుర ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. ఆగ్రావైపు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ తొలుత డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. ఇదే సమయంలో డివైడర్‌, ఆయిల్ ట్యాంకర్‌కు మధ్యగా కారు రావడంతో ప్రమాదం చోటుచేసుకుందని తమ ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న ఏడుగురూ చనిపోయారని ఎస్పీ తెలిపారు. ఘటన గురించి ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి తమకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జవడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ గాయపడినట్టు తెలిపారు. వీరిని వైద్యం కోసం మథుర ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరు హరియాణాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.


By February 24, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/seven-killed-as-oil-tanker-collides-with-car-on-yamuna-expressway-in-uttar-pradesh/articleshow/81182830.cms

No comments