Breaking News

వాలంటైన్స్ డే గిఫ్ట్.. హైదరాబాద్ యువతికి చంద్రుడిపై భూమికొనిచ్చిన కాబోయే భర్త!


ప్రేమికుల దినోత్సవం రోజున తాము ప్రేమించిన వ్యక్తులకు విలువైన బహుమతులు, ఖరీదైన కానుకలు ఇవ్వడం సర్వసాధారణం. అయితే, ఓ వ్యక్తి మాత్రం తన కాబోయే భార్యకు ఏకంగా చంద్రుడిపైనే భూమిని కొనుగోలు చేసి కానుకగా ఇచ్చాడు. అంతేకాదు, ఓ నక్షత్రానికి ఆమె పేరు కూడా పెట్టడం విశేషం. ఇండోర్‌కు చెందిన పలాష్ నాయక్ సందర్భంగా తనకు కాబోయే భార్య కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ఆకాశంలోని ఒక నక్షత్రానికి ఆమె పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం పలాష్ నాయక్ దుబాయ్‌లో ఉంటూ ఫ్రీ లాంచింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి కాబోయే భార్య హైదరాబాద్‌కు చెందిన యువతే. ప్రియమైన వారికి ఏదైనా భిన్నంగా ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే చంద్రునిపై భూమి కొనేందుకు నిర్ణయించినట్టు పలాష్‌ పేర్కొన్నారు. చంద్రునిపై ఒక ఎకరం భూమిని కలిగి ఉన్నట్లు ధ్రువపత్రాన్ని కూడా పొందాడు. అంతకుముందు భారతదేశంలో కొంత మందికి మాత్రమే చంద్రుడి మీద భూమిని సొంతం చేసుకున్న అనుభవం ఉంది. ఇటీవల రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త సైతం తన పెళ్లిరోజున భార్యకు చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా తన భార్య సప్న కోసం చంద్రుని మీద భూమిని కొనాలన్న కలను చేసుకున్నారు. చంద్రునిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా, డిసెంబర్ 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు. ధర్మేంద్ర, సప్నా ఇద్దరూ అజ్మీర్‌ జిల్లాకు చెందినవారే. కాలేజీ రోజుల్లోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్ర బ్రెజిల్‌లో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ చేస్తుంటారు. చంద్రుడి మీద స్థలం కొనడం సులభమైతే అందరూ కొనేవారు అని ధర్మేంద్ర అన్నారు.


By February 15, 2021 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indore-man-land-on-the-moon-for-gift-to-fiance-on-valentines-day/articleshow/80917586.cms

No comments