Breaking News

అర్ధరాత్రి వేటకు.. అడవి పందిగా భావించి ఫ్రెండ్‌నే కాల్చేశాడు!


అడవి జంతువుల వేటకు వెళ్లి పొరపాటుప స్నేహితుడినే ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్చిన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అంజెట్టి సమీపంలోని వన్నియపురానికి చెందిన పజప్ప (40).. తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామవాసి నాగరాజు (27) స్నేహితులు. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి హోసూర్ అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. అడవి పందులను వేటాడేందుకు స్నేహితులు చెరో దిక్కుకు వెళ్లారు. నాగరాజు వెళ్లిన ప్రాంతంలో అర్ధరాత్రి పెద్ద శబ్దం రావడంతో అది అడవి పంది అయి ఉంటుందని భావించాడు. దీంతో తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చాడు. అనంతరం కాల్పులు జరిపిన చోటుకు వెళ్లి చూసేసరికి స్నేహితుడు పజప్ప రక్తమడుగులో పడి ఉన్నాడు. తాను జరిపిన కాల్పులకు పొరపాటున స్నేహితుడు మృతి చెందడంతో భయపడిపోయిన నాగరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం గురించి చెప్పి లొంగిపోయాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నాగరాజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ‘పజప్ప, అంజెట్టి సమీపంలోని తోటమంజీ గ్రామానికి చెందిన నాగరాజన్ అడవి పందులను వేటాడేందుకు నాటు తుపాకులతో అడవిలోకి ప్రవేశించారు. పందులను వెతుక్కుంటూ వారు వేర్వేరు దిశల్లో తిరిగారు.. రాత్రివేళ చీకటిలో ఒక కదలికను గమనించిన నాగరాజు కాల్పులు జరిపాడు.. అయితే, అది స్నేహితుడని గ్రహించలేకపోయాడు’ అని ఓ పోలీస్ అధికారి అన్నారు. డెంకన్‌కొట్టయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.


By February 13, 2021 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/poacher-shoots-down-friend-mistook-him-for-a-wild-boar-in-tamil-nadu/articleshow/80891470.cms

No comments