Breaking News

బెంగళూరు: ఒకే అపార్ట్‌మెంట్‌లో 103మందికి కరోనా.. లైట్ తీస్కుంటే అంతే మరి!


బెంగళూరులో కరోనా కలకలంరేపింది. బిలేకహళ్లిలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో ఏకంగా 103 మందికి కరోనా సోకింది. ఈ నెలలో అపార్ట్‌మెంట్‌లో కొన్ని పార్టీలు జరిగాయి. నాలుగైదు రోజుల తర్వాత కొంతమందిలో కరోనా లక్షణాలు కనిపించటంతో పరీక్షలు నిర్వహించారు. సోమవారం 35 మంది, మంగళవారం మరో 68 మందికి కరోనా లక్షణాలున్నట్లు తేలింది. మొత్తం 435 ఫ్లాట్లున్న ఈ అపార్టుమెంట్‌లో 1500 మంది ఉంటున్నారు.. మొత్తం వెయ్యి మందికి కరోనా పరీక్షలు చేశారు. మిగిలిన వారి రిపోర్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఈ అపార్టుమెంట్‌ వాసులను హోం ఐసొలేషన్‌ చేశారు. ఆ అపార్ట్‌మెంట్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ఫిబ్రవరి 12న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా మెడికల్ బృందాన్ని అక్కడికి పంపారు. ఆ అపార్ట్‌మెంట్‌ను మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ తేలిన కాంటాక్ట్‌లను కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు పంపారు. కంగారుపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనాతో హాని లేదని అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అంటున్నారు. ఏదైనా పార్టీలు, ఫంక్షన్‌లు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని గుర్తు చేస్తున్నారు. అయితే ఒకే అపార్ట్‌మెంట్‌లో ఇలా 100మందికిపైగా కరోనా పాజిటివ్ తేలడం కలకలంరేపింది.


By February 17, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-100-coronavirus-cases-in-a-apartment-at-bengaluru/articleshow/81027306.cms

No comments