Breaking News

ఆ కల సాకారమవుతోంది.. బాస్ ప్రేమను చూపించే సమయం వచ్చేసింది: తమన్ ఎమోషనల్ ట్వీట్


టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడమనేది ప్రతి ఒక్క యాక్టర్, టెక్నీషియన్ కల. ఆ చాన్సు కోసం అంతా వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి మెగాస్టార్ సినిమాలో అవకాశం దక్కితే చాలు అదే తమ అతిపెద్ద విజయంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా దూసుకుపోతున్న .. మెగాస్టార్ కొత్త సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓపెన్ అవుతూ ట్విట్టర్‌లో ఓ సందేశం పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ సినిమాకు బాణీలు కట్టాలని ఆశగా ఎదురుచూస్తున్న తమన్, మొదటిసారి మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న (బుధవారం) ప్రారంభమైంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేయబోతున్నారు. అయితే ఈ మెగా ప్రాజెక్టులో భాగమవుతున్న సందర్భంగా తమన్ ట్వీట్ చేస్తూ.. ''ఏ కంపోజర్ కైనా కూడా ఇది బిగెస్ట్ డ్రీమ్. బాస్ పై నా ప్రేమను చూపించే టైమ్ వచ్చేసింది. తెలుగు లూసిఫర్‌తో మా జర్నీ మొదలు కాబోతోంది'' అని పేర్కొన్నారు. గతంలో రామ్‌ చరణ్ హీరోగా వచ్చిన ‘బ్రూస్‌లీ’లో చిరు కామియో ఎంట్రీకి తమన్‌ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన సినిమాకు పూర్తిస్థాయిలో బాణీలు కట్టబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.


By January 21, 2021 at 08:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thaman-expressed-his-feelings-on-doing-project-with-chiranjeevi/articleshow/80378204.cms

No comments