Breaking News

సంక్రాంతి వేళ చిరంజీవి ఇంట సంబరాలు.. మెగా ఫ్రేమ్‌లో నాగార్జున.. ఫొటో వైరల్


ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటుతుంటాయి. పేద, ధనిక అనే తేడాలేకుండా అన్నివర్గాల ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ ఇంట సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే మెగా ఇంట జరిగిన ఈ సంబరాల్లో అక్కినేని హీరో కూడా భాగం కావడం విశేషం. సంక్రాంతి పండగ‌ను చిరంజీవి, ఆయన ఫ్యామిలీతో కలిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు నాగార్జున. మెగాస్టార్ ఇంట జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సంగీతం వింటూ విందు ఆర‌గిస్తూ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి వేడుకను ఎంజాయ్ చేయడమే గాక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.‌ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స‌హా మెగా ఫ్యామ‌లీ హీరోలు రామ్‌ చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌, అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం మెగా ఫ్రేమ్‌లో నాగార్జున నిల్చున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్‌లో చిరంజీవి, నాగార్జున ప్రేక్షక లోకానికి కనువిందు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇలా సంక్రాంతి వేళ ఓకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇరువురి అభిమానులను హుషారెత్తిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. తన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


By January 15, 2021 at 01:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagarjuna-participated-in-sankranthi-celebrations-at-chiranjeevi-house/articleshow/80282976.cms

No comments