Breaking News

ద్విచక్రవాహదారుడికి రూ.1.13లక్షల ఫైన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు


రోడ్లపై కనీస జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా తిరిగే వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తూ ఉంటారు. నిబంధన ఉల్లంఘించిన తీరును బట్టి రూ. వందల్లోనే, వేలల్లోనే జరిమానాలు విధించడం సాధారణమే. అయితే బైక్‌కి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, కనీసం హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనం నడుపుతున్న ఓ వ్యాపారికి ఏకంగా రూ.1.13లక్షల జరిమానా విధించి దిమ్మతిరిగే షాకిచ్చారు అధికారులు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడలో బుధవారం జరిగింది. Also Read: ఒడిశాలోని డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్‌ డ్రమ్ముల వ్యాపారం చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ బంజార బైక్‌పై వెళ్తుండగా ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తుండటం చూసి అధికారులు షాకయ్యారు. ద్విచక్రవాహనానికి సంబంధించి పత్రాలు అడగ్గా ప్రకాశ్‌ ఏమీ లేవని సమాధానం చెప్పాడు. కనీసం బైక్‌కి రిజిస్ట్రేషన్‌ కూడా లేవని అధికారులు అవాక్కయ్యారు. అతడు హెల్మెట్ కూడా పెట్టుకోకుండా హైవేపై ప్రయాణించడాన్ని తీవ్రంగా పరిగణించారు. రూ.1.13లక్షల జరిమానా వేసి అది కడితే గానీ కదలినిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో షాకైన ప్రకాశ్‌ అప్పటికప్పుడు తన సన్నిహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించి వెళ్లిపోయాడు.


By January 14, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/motorcyclist-fined-over-rs-1-13-lakh-in-rayagada-odisha-for-violating-motor-vehicle-act/articleshow/80261396.cms

No comments