కాంట్రాక్టర్ని చంపి వాహనాలకు నిప్పు.. ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/79776842/photo-79776842.jpg)
ఆంధ్ర - ఒడిశా బోర్డర్లో మరోమారు దుశ్చర్యకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ని అతి దారుణంగా హత్య చేశారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ సహా బొలెరో వాహనాన్ని తగలబెట్టారు. ఈ దారుణ ఘటన ఏపీ సరిహద్దు జిల్లా అయిన మల్కన్గిరిలో చోటుచేసుకుంది. మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామ పరిధిలో ఈ ఘటనతో ఏవోబీలో అలజడి రేగింది. రహదారి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సుకుమార్ మండల్పై కన్నెర్రజేశారు. ఆయనను అతిదారుణంగా చంపేశారు. విశాఖ జిల్లా సరిహద్దులో ఈ ఘటన జరగడంతో స్థానికంగా కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By December 17, 2020 at 02:51PM
No comments