Breaking News

డాక్టర్‌ని చంపి బంగారం, నగదు దోపిడీ.. అవనిగడ్డలో దారుణం


కృష్ణా జిల్లా అవగనిగడ్డలో ప్రముఖ డాక్టర్ కోట శ్రీహరిరావు(70) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి కిరాతకంగా చంపేశారు. ఇంట్లో బీరువాలో ఉంచిన బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన పోలీసులు వాటి కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు వాటి వైర్లను కట్ చేసి కెమెరాలను పైకి తిప్పినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అసలేం జరిగింది.. డాక్టర్ శ్రీహరిరావు భవనంలోని కింది అంతస్తులో ఆస్పత్రి నిర్వహిస్తూ పైఅంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు, కొడుకు కూడా వైద్యులే. హైదరాబాద్, ఖమ్మంలో స్థిరపడ్డారు. ఆయన భార్య లక్ష్మి పిల్లల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకి డాక్టర్ శ్రీహరిరావు ఆస్పత్రికి వచ్చి రోగులకు వైద్య సేవలందిస్తారు. ఆ రోజు 9.30 గంటలైనా ఆయన రాకపోవడంతో సిబ్బంది పైఅంతస్తులో ఉన్న డాక్టర్‌‌కి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయకపోవడంతో నర్సు పైకి వెళ్లి చూసి షాక్‌కి గురైంది. రక్తపు మడుగులో పడి ఉన్న డాక్టర్ శ్రీహరిరావుని చూసి భయంతో కేకలు వేస్తూ కిందకు వచ్చి అందరికీ విషయం చెప్పింది. రంగంలోకి పోలీసులు.. ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దుండగులు ఆస్పత్రిలో ఉన్న రోగుల బంధువుల్లా లోపలికి వచ్చి ఇంట్లోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు బీరువాల్లో దాచి ఉంచిన బంగారం, కొంత నగదు తీసుకుని పారిపోయే క్రమంలో డాక్టర్ గమనించి అడ్డుపడడంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లోకి వచ్చేముందు సీసీ కెమెరాలను వైర్లను కట్ చేసి.. కెమెరాలను పైకి తిప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది. Also Read:


By November 29, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/burglars-murders-doctor-robs-gold-in-krishna-district/articleshow/79472382.cms

No comments