Breaking News

భారత్ సహా విదేశీ ప్రయాణికులపై చైనా తాత్కాలిక నిషేధం


కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భారత్‌ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అక్టోబరు 30న ఢిల్లీ నుంచి వుహాన్‌కు వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానంలోని 20 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన వెలువరించింది. చైనా వీసాలు మంజూరైనప్పటికీ భారత్‌ నుంచి వచ్చే వారికి తమ కాన్సులేట్లలో ఆరోగ్యానికి సంబంధించిన పత్రాలపై స్టాంపును వేయబోమని స్పష్టంచేసింది. అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేసినవారికి నవంబరు 3 తర్వాత మంజూరు చే అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం కేవలం భారత్ నుంచి వచ్చే విదేశీ ప్రయాణీకులపైనే నిషేధం విధిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొలేదని పేర్కొన్నాయి. ఇతర దేశాలకు కూడా ఇవి వర్తిస్తాయని అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, బంగ్లాదేవ్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చేవారికి కూడా ఇవి వర్తిస్తాయి. అయితే, దౌత్య ఉద్యోగులు, సి-వీసాదారులకు మినహాయింపు ఉంటుంది. కారణంగానే తాత్కాలికంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించినట్టు చైనా ఎంబసీ తెలిపింది. కొనసాగుతున్న మహమ్మారి వ్యాప్తి పరిస్థితులకు అనుగుణంగా చైనా సకాలంలో మరింత సర్దుబాటు చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ప్రారంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం వల్ల చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. చైనా ఎంబసీతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని, అత్యవసర ప్రయాణాలకు సౌకర్యాలు కల్పించాలని కోరిందన్నారు. చైనా నిర్ణయంతో వందే భారత్ విమానాలకు అక్కడకు కేంద్రం నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభించడంతో సరిహద్దులను మార్చిలో మూసివేసిన చైనా.. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించింది.


By November 06, 2020 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-temporarily-suspend-the-entry-by-foreign-nationals-including-india/articleshow/79074803.cms

No comments