Breaking News

ఆమెకు పిల్లలు పుట్టరన్న జ్యోతిష్కుడు.. చివరికి..


పెళ్లై ఏడాది తిరక్కుండానే భార్య గర్భం దాల్చలేదంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో చిత్రవధ చేశారు. పిల్లలు పుట్టకపోతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సింది పోయి జ్యోతిష్కుడిని సంప్రదించారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని జోస్యం చెప్పడంతో నమ్మేసిన కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. భరించలేకపోయిన భార్య అఘాయిత్యానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. అగారా ఏరియాకి చెందిన అశ్విని(25)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో యువరాజ్‌తో వివాహమైంది. కొద్దికాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లై ఏడాది కూడా తిరక్కుండానే భార్య గర్భం దాల్చడం లేదంటూ అత్తింటి వారు సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. సమస్య ఉంటే ఆస్పత్రికి వెళ్లి భార్యాభర్తలు చికిత్స చేయించుకోవాల్సింది పోయి ఆమెను ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకి పిల్లలు పుట్టరని జ్యోతిష్కుడు తేల్చిచెప్పడంతో అశ్వినికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు చీటికీమాటికీ ఘర్షణ పడుతుండడంతో భరించలేకపోయింది. ఇంట్లో చిన్న విషయమై మరోమారు గొడవ జరగడంతో తట్టుకోలేకపోయిన అశ్వని వేరే గదిలోకి వెళ్లి చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 15, 2020 at 11:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-harassed-wife-ends-life-after-astrologer-says-she-cant-conceive/articleshow/79230064.cms

No comments