Breaking News

రైతుకు రెండేళ్లలో అపార సంపదలు.. ఐటీ సోదాల్లో విస్తుపోయే నిజాలు


ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆర్థికంగా చితికిపోయిన ఓ మోతుబారి రైతు రెండేళ్లల్లోనే అపర కుబేరుడిగా మారిపోయారు. ఆయనకు అపార సంపదలు వచ్చిన చేరినట్టు ఆదాయ పన్ను శాఖ దృష్టికి వచ్చింది. దీంతో ఆ రైతు ఇంటిలో ఐటీ వర్గాలు సోదాలు నిర్వహిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం చెందిన సుగీష్‌ చంద్రన్‌ మోతుబారి రైతు. ఒకప్పుడు భారీగా ఆస్తులున్నా క్రమంగా అవి కరిగిపోయాయి. కొన్నేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అయితే, రెండేళ్లలో వీరి సంపద ఊహించని విధంగా రెట్టింపయినట్టు ఐటీ పరిశీలనలో తేలింది. Read Also: పోగొట్టుకున్న ఆస్తులను మళ్లీ కొనడం, కొత్త స్థలాల కొనుగోలు అంటూ ఈయన సంపద ఎవ్వరూ ఊహించని రీతిలో పెరిగింది. దీని వెనుక చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమారుడు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటీ శాఖ విచారణలో వెల్లడయ్యింది. కరోనా కట్టిడికి విధించిన లాక్‌డౌన్‌కు ముందు ఆ గ్రామంలో రాధాకృష్ణన్‌ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగళాను సైతం కొనుగోలు చేశారు. దీంతో వారం రోజులుగా ఐటీ వర్గాలు ఈ రైతు కుటుంబం ఆదాయ వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. Read Also: ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు ఆ ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. ఇవి శనివారం కూడా కొనసాగాయి. పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ రైతు కుటుంబానికి అపార సంపద హఠాత్తుగా ఎలా వచ్చిందో గుట్టురట్టు చేయాలని కంకణం కట్టుకున్నారు. చెన్నైలోని అతడి కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడి నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. Read Also:


By November 29, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/income-tax-raids-in-farmer-house-in-kadalur-in-tamil-nadu/articleshow/79471651.cms

No comments