Breaking News

‘వచ్చి అరెస్టు చేయండి.. వెయిట్ చేస్తుంటా’.. పోలీసులకు యువతి షాకింగ్ ఫోన్ కాల్


పదహారేళ్ల టీనేజ్ యువతి డయల్ 100కి ఫోన్ చేసి షాకిచ్చింది. వచ్చి తనను అరెస్టు చేయాలని.. పోలీసుల కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పడంతో ఖాకీలు కంగుతిన్నారు. తీరా విషయమేంటని ఆరా తీస్తే చావు కబురు చల్లగా చెప్పింది. తల్లితో గొడవపడుతున్నాడని తండ్రిని చంపేశానని.. వచ్చి అరెస్టు చేయాలని కోరింది. మైనర్ కావడంతో పోలీసులు ఆమెను జువైనల్ హోమ్‌కి తరలించారు. ఈ షాకింగ్ ఘటన రాజధాని భోపాల్‌లో జరిగింది. జిల్లాలోని బెరాసియాకి చెందిన దంపతులు కొడుకు, కూతురుతో కలసి నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన తండ్రి పనీపాటా లేకుండా తిరుగుతూ ఉండేవాడు. కొడుకు బేల్దారి పనులకు వెళ్లి సంపాదించిన డబ్బుతోనే కుటుంబం నడుస్తోంది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కొడుకు పెళ్లి గురించి దంపతుల మధ్య జరిగిన చర్చ వివాదానికి దారితీసింది. మద్యం మత్తులో ఉన్న భర్త అమానుషంగా భార్యపై దాడికి దిగాడు. తల్లిని కొడుతున్న తండ్రిని చూసి కోపంతో రగిలిపోయిన కూతురు(16) బట్టలు ఉతికేందుకు వాడే బలమైన కర్రతో దాడి చేసింది. తండ్రి తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడే పడిపోయాడు. అయినా శాంతించని కూతురు ఇనుప రింగులు ఉన్న మరో కర్ర(లొహంగి)తో విచక్షణా రహితంగా కొట్టింది. తీవ్రగాయాలపాలైన తండ్రి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కూతురు డయల్ 100కి ఫోన్ చేసి తన తండ్రిని చంపేశానని.. వచ్చి అరెస్టు చేయాలని కోరింది. వచ్చే వరకూ ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. Also Read: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో జువైనెల్ హోమ్‌కి తరలించారు. ఆ కుటుంబం కొడుకు సంపాదనపైనే బతుకుతోందని.. పనీపాటా లేకుండా తిరుగుతున్న తాగుబోతు తండ్రితో విసిగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోందని బెరాసియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కేకే వర్మ తెలిపారు. Read Also:


By October 23, 2020 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-year-old-girl-kills-father-for-thrashing-mother-in-madhya-pradesh/articleshow/78821823.cms

No comments