Breaking News

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి.. 24 మందికి గాయాలు


మధ్యప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధార్ జిల్లా చిఖాలియా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన భారీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లోని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి కూలీలతో వస్తున్న వ్యాన్‌ టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని డ్రైవర్ పక్కకు తీసి నిలిపాడు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టిడంతో వ్యాన్‌లోని వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. అర్ధరాత్రి వేళ బాధితుల ఏడుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. వీరంతా ఒకే గ్రామానికి చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో వ్యాన్‌లోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారని, మృతదేహాలను అతికష్టంతో బయటకు తీశామన్నారు.


By October 06, 2020 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/al-least-six-killed-and-24-injured-in-road-accident-in-madhya-pradesh/articleshow/78506087.cms

No comments