Breaking News

కాపురానికి పిలిచిన భర్త.. భార్య రాననడంతో.. ప్రకాశంలో దారుణం


ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాపురానికి వచ్చేది లేదని భార్య తెగేసి చెప్పడంతో భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా కత్తితో పొడిచేశాడు. ఈ అమానుష ఘటన కారంచేడులో జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెంకి చెందిన నన్నేసాహెబ్‌‌కి రంజనితో 13 ఏళ్ల కింద వివాహమైంది. ఇద్దరు పిల్లలు సంతానం. కొద్దికాలం సాఫీగానే సాగిని వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. గత మూడేళ్ల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నాడు. కొద్దికాలం మౌనంగా భరించిన భార్య.. వేధింపులు ఎక్కువవడంతో కారంచేడులో ఉంటున్న సోదరి బాజీ వద్దకు వచ్చింది. అక్కడికి వచ్చిన భర్త నన్నేసాహెబ్ కాపురానికి రావాలని అడిగాడు. అందుకు రంజని ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొట్టలో పొడిచేశాడు. కత్తిపోట్లకు గురైన రంజినిని ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చీరాల ప్రభుత్వాస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు వివరాలు నమోదు చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. Also Read:


By September 29, 2020 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-stabs-wife-with-knife-over-family-dispute-in-prakasam-district/articleshow/78380600.cms

No comments