శంషాబాద్: కామంతో యువకులు.. గదిలో ఒంటరిగా యువతి.. రాత్రంగా నరకం చూపిస్తూ

వందే భారత్ మిషన్లో భాగంగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్న వైద్య విద్యార్థినిపై ముగ్గురు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. శంషాబాద్లోని వీజేఆర్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదుతోఆర్జీఐఏ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెంగళూరుకు చెందిన యువతి (24) ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతోంది. వందేభారత్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ప్రైవేట్ బస్సు కోసం హైవేపై ఎదురు చూస్తోంది. Also Read: ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విజయ్కుమార్ (26) పురేందర్ కుమార్(25), శంషాబాద్కు చెందిన వస్త్ర వ్యాపారి పి.రామస్వామి కుమారుడు ప్రవీణ్ ఆమెను గమనించి మాటలు కలిపారు. రాత్రివేళ అక్కడ ఉండటం మంచిది కాదని, బస్సు వచ్చేవరకు పక్కనే ఉన్న వీజేఆర్ హోటల్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన యువతి ఆ హోటల్లో గది అద్దెకు తీసుకుంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు కామాంధులు రిజిస్టర్లో ఆమె రాసిన ఫోన్ నంబర్ తెలుసుకుని అర్ధరాత్రి సమయంలో మెసేజ్లు చేయడం మొదలు పెట్టారు. అది వారి పనేనని తెలుసుకున్న యువతి భయంతో వణికిపోయింది. Also Read: అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముగ్గురూ కలిసి యువతి గది తలుపులు గట్టిగా తట్టారు. నీతో మాట్లాడాలి, తలుపు తీయ్.. అంటూ అరిచారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె వెంటనే తన అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో అతడు హైదరాబాద్లో ఉండే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చేసి తన చెల్లికి సాయం చేయాలని కోరాడు. వివరాలన్ని తెలుసుకున్న వారు వెంటనే శంషాబాద్లోని ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే వీజేఆర్ హోటల్కు చేరుకుని యువతిని కాపాడారు. ఆమెను వేధించిన విజయ్, పురేందర్ కుమార్, ప్రవీణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీజేఆర్ హోటల్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ సీఐ విజయ్కుమార్ తెలిపారు. Also Read:
By August 19, 2020 at 09:55AM
No comments