Breaking News

అనంత: బంధువుతో వివాహిత అఫైర్.. వదిలి ఉండలేక అఘాయిత్యం


ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత అతడిని విడిచి ఉండలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో జరిగింది. ఆమెతో పాటు పురుగు మందు తాగిన ప్రియుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన అంజలికి పదేళ్ల కిందట మహేంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కొన్నాళ్లుగా ఆమె తన సమీప బంధువైన బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన యోగానంద్‌‌తో కొనసాగిస్తోంది. Also Read: ఈ విషయం ఇటీవల బయటపడటంతో భర్తతో పాటు బంధువులు వారిద్దరిని మందలించారు. పద్ధతిగా ఉంటూ ఎవరి సంసారం వారు చూసుకోవాలని, మళ్లీ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన అంజలి, యోగానంద్ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం మండలం సీసీకొత్తకోట బస్టాప్‌ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Also Read: అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంజలి ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు యోగానంద్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అంజలి భర్త మహేంద్ర ఫిర్యాదుతో ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. Also Read:


By August 24, 2020 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-anatapur-district-over-illegal-affair/articleshow/77711888.cms

No comments