Breaking News

మునిగిన పడవ... నలుగురు మత్స్యకారులు గల్లంతు


కర్నాటకలో చోటు చేసుకుంది. మంగళూరు వద్ద కొడేరి గ్రామ సమీపంలోని అరేబియా సముద్రంలో పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు మత్స్యకారులు సుముద్రంలో గల్లంతయ్యారు. ఉడుపి జిల్లా బైందూర్ తాలూకా కొడేరి గ్రామ ఫిషింగ్ హార్బరు వద్ద రెండు పడవల్లో 24 మంది మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అరేబియా సముద్రంలో అలల తాకిడి వల్ల ప్రమాదవశాత్తూ ఓ పడవ మునిగింది. దీంతో మునిగిన పడవలో ఉన్న 12 మంది ఉండగా వారిలో 8మంది మత్స్యకారులు ఈత కొడుతూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. శేఖర్ ఖర్వీ(35), నాగరాజ్ ఖర్వీ(46), లక్ష్మణ్ ఖర్వీ (34), మంజునాథ్ ఖర్వీ (38)లు అనే నలుగురు మత్స్యకారులు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్తా సెక్యూరిటీ పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టారు. కుందాపూర్ ఏసీపీ రాజు, డిప్యూటీ కమిషనర్ జగదీషాలు సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి గాలింపు ప్రక్రియను సమీక్షించారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన బోటు పేరు సాగరశ్రీగా గుర్తించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించినప్పటికీ మత్స్యకారులు పడవలో వెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు కర్నాటకలో కూడా భారీ వర్షలు కురుస్తున్నాయి. ఉడుపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షపాతం నమోదైంది.


By August 17, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4-fishermen-missing-after-boat-capsizes-off-the-coast-of-udupi-at-karnataka/articleshow/77582967.cms

No comments