చిత్తూరు జిల్లాలో గుట్టుగా వ్యభిచారం.. పోలీసులకు పట్టించిన స్థానికులు

కరోనా సమయంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలని ఓ వైపు అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తుంటే కొందరు మాత్రం ఆడవాళ్ల శరీరాలతో అక్రమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జిల్లా పట్టణంలోని ప్రశాంత్నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు కలసి ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకొస్తున్నారు. Also Read: ప్రశాంత్నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవల ఆ ఇంటికి యువకుల తాకిడి ఎక్కువ కావడతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ రాజేంద్రనాథ్యాదవ్, ఎస్సై వంశీధర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అరెస్ట్ చేసి ఏడుగురు సెక్స్వర్కర్లకు విముక్తి కల్పించారు. యువతుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి చీకటి వ్యాపారం చేస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
By August 19, 2020 at 10:58AM
No comments