Breaking News

యాదాద్రి: బంధువు బైక్ ఎక్కిన గర్భిణి.. గదిలో బంధించి రెండ్రోజులు రేప్


గర్భంతో ఉన్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మించిన సమీప బంధువు ఆమెను ఓ గదిలో బంధించి రెండ్రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మహిళ(25) కొంతకాలం క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం ఉండగా నాలుగు నెలల క్రితం మళ్లీ గర్భం దాల్చడంతో విశ్రాంతి కోసమని కొద్దిరోజుల క్రితం ఆలేరులోని పుట్టింటికి వచ్చింది. Also Read: ఐదు రోజుల క్రితం నెలవారీ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం జనగామలోని ఆసుపత్రికి వెళ్లేందుకు ఆలేరు ఆర్టీసీ బస్టాండులో వేచి చూస్తోంది. ఇంతలో సమీప బంధువైన మోతె మల్లయ్య అనే వ్యక్తి బైక్‌పై వచ్చి తాను ఆస్పత్రి వద్ద దించుతానని చెప్పాడు. నమ్మి బైక్ ఎక్కిన మహిళను మల్లయ్య యాదగిరిగట్టకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బంధించి రెండ్రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 23వ తేదీన అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. Also Read: అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో 24వ తేదీన రాచకొండ పోలీస్ కమిషనర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో యాదగిరిగుట్ట గ్రామీణ పోలీసులు ప్రధాన నిందితుడు మోతె మల్లయ్యతో పాటు అతడికి సహకరించిన మోతె వెంకటయ్య, నర్సయ్య, మోతె సమ్మయ్య, మోతె కనకయ్యలపై ఐపీసీ 366, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By August 26, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-months-pregnant-raped-by-relative-in-yadadri-bhuvanagiri-district-5-arrested/articleshow/77754224.cms

No comments