ఇరీడియం ఖనిజం పేరుతో రూ.6 కోట్ల మోసం.. అధికార పార్టీ నేత అరెస్ట్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఖనిజాల్లో ఒకటైన ఇరీడియం పేరుతో రూ.6 కోట్ల మేర మోసానికి పాల్పడిన రాజకీయ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. రామనాథపురం జిల్లా వనసంగరియమ్మన్ ఆలయ ప్రాంతానికి చెందిన మునియస్వామికి కొంతకాలం క్రితం కరూర్ ప్రాంతానికి చెందిన మదన్కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను లండన్లో విమాన విడిభాగాలు తయారుచేసే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు అతడిని మునియస్వామి నమ్మించాడు. Also Read: తన వద్ద ఖరీదైన ఉందని, దాన్ని ఇంట్లో పెట్టుకుంటే భారీగా ఆదాయం వస్తుందని మదన్కుమార్ను నమ్మించాడు. మునియస్వామి వలలో పడిన అతడు ఏకంగా రూ.6కోట్లు ఇచ్చాడు. ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా ఇరీడియం ఇవ్వకపోవడంతో మదన్ తన డబ్బులు తిరిగివ్వాలంటూ డిమాండ్ చేశాడు. Also Read: దానికి నిరాకరించిన మునియస్వామి తన అనుచరులైన అన్నాడీఎంకే నేత సుకుమార్, వీరబాబు ద్వారా బాధితుడిని బెదిరించాడు. దీంతో మదన్కుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు సుకుమార్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మునియస్వామి, వీరబాబు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. Also Read:
By August 17, 2020 at 09:13AM
No comments